చిన్న ప్రాణం.. పెద్ద కష్టం..
-నాలుగు నెలల బాబుకి అత్యవసరంగా కాలేయ మార్పిడి
-రూ. 20 లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం
-సాయం కోసం ఎదురుచూస్తున్న కుటుంబం

మంచిర్యాల : చిన్న ప్రాణానికి పెద్ద కష్టం వచ్చింది… తల్లి ఒడిలో సేదాతీరాల్సిన సమయంలో, అమ్మ తప్ప మరో ప్రపంచం ఎరుగని ఆ చిన్నారి ప్రాణం కాపాడుకునేందుకు ఆ కుటుంబం అష్టకష్టాలు పడుతోంది. రెక్కాడితే గాని డొక్కాడని పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమ చిన్నారికి ప్రాణభిక్ష పెట్టమని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
మడావి అతీష్ మంచిర్యాల కలెక్టరేట్లో సీసీగా విధులు నిర్వహిస్తున్నారు. అతీష్ దంపతులకు నాలుగు నెలల కిందట బాబు జన్మించాడు. కొద్ది రోజులుగా అతని ఆరోగ్యం బాలేక పోవడంతో వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లారు. ఆ చిన్నారి అయాన్ష్ కు వచ్చింది చిన్న జబ్బు కాదని తెలియడంతో వారు కన్నీటి పర్యంతం అవుతున్నారు. అరుదైన కామెర్ల వ్యాధి రావడంతో ఖచ్చితంగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. దీంతో ఏం చేయాలో అర్దం కాక ఆ కుటుంబ కన్నీటి పర్యంతం అవుతోంది.
శస్త్రచికిత్సకు రూ. 20 లక్షలు కావాలి..
ప్రస్తుతం అయాన్ష్ కు ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించాల్సి ఉంది. పేద కుటుంబానికి చెందిన తమకు ఇంత పెద్ద మొత్తం సమకూర్చడం సాధ్యం కాదని తల్లిదండ్రులు వాపోతున్నారు. దాతలు స్పందించి తన కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని కోరుకుంటున్నారు. సహాయం చేయూల్సిన దాతలు 9000072687 ఫోన్ పే & గూగుల్ పే చేయాలని కోరుతున్నారు.
ఎన్ఆర్ఐ రూ. 20 వేలు సాయం..
బెల్లంపల్లికి చెందిన ఎన్ఆర్ఐ తోడె కృష్ణారెడ్డి ఆ చిన్నారి విషయం తెలుసుకుని ఆర్థిక సాయం అందించారు. ఆయన తన వంతుగా రూ. 20 వేలు అందించారు. చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన కోరారు.