లంచం తీసుకుంటుగా ముగ్గురి అరెస్ట్
లంచం తీసుకుంటుగా ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం తహసీల్దార్ సంపత్, సీనియర్ అసిస్టెంట్ అజీమోద్దిన్, ప్రైవేట్ అసిస్టెంట్ లింగస్వామిలు లంచం తీసుకుంటుడగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్సీ భద్రయ్య ఆధ్వర్యంలో అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలోనే పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కథనం ప్రకారం.. అంతర్గాం మండంలోని భూమిసర్వే చేయడానికి ఒక వ్యక్తి దగ్గర రూ. 2లక్షలు డిమాండ్ చేశారు. మండల సర్వేయర్ కు సర్వే కోసం మోమో ఇవ్వడానికి లంచం డిమాంగ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. లంచం డబ్బులు ప్రైవేట్గా పెట్టుకున్న వ్యక్తికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సీనియర్ అసిస్టెంట్ అజీమోద్దీన్ సెలవులో ఉండగా ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. తహసీల్దార్ కలెక్టరేట్ మీటింగ్లో ఉండగా అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ వివరించారు. వీరిని రేపు ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.