నివాళి.. ఒంటరి..

మంచిర్యాల : రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేం… త‌మ చుట్టూ ఉన్న ఒక్క‌సారిగా మాయం కావ‌చ్చు… లేదా దూరం ఉన్న వారంతా మ‌న చుట్టూ చేరివ‌చ్చు.. దీనికి ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ మంచిర్యాల జిల్లా జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్ న‌ల్లాల భాగ్య‌ల‌క్ష్మి.. మొన్న‌టి వ‌ర‌కు టీఆర్ఎస్‌లో ఉండ‌టంతో ఆమె చుట్టూ మంది, మార్బ‌లం. పెద్ద ఎత్తున హ‌డావిడి ఉండేది. ఏ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అధికార పార్టీ నేత‌లు, అధికారులు, పెద్దఎత్తున పోలీసు బ‌ల‌గాలు. ఇప్పుడు ఆమె పార్టీ మారారు. కొద్ది రోజుల కింద‌ట కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్ న‌ల్లాలభాగ్య‌ల‌క్ష్మి, ఆమె భ‌ర్త మాజీ ఎమ్మెల్యే ఓదెలు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో ఆమె చుట్టూ జ‌నం మాయం అయ్యారు. రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వ వేడుక‌ల్లో పెద్ద ఎత్తున నేత‌లు, కార్య‌క‌ర్త‌లు హ‌డావిడితో అమ‌ర‌వీరుల‌కు నివాళులు అర్పించేవారు. కానీ గురువారం ప‌రిస్థితి అందుకు భిన్నంగా క‌నిపించింది. అమ‌ర‌వీరుల స్థూపం ద‌గ్గ‌ర జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్ ఒంట‌రిగా నివాళి అర్పించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like