సేవా పతకాలు అందజేసిన క‌మిష‌న‌ర్

రామగుండం కమీషనరేట్ లో 39 మందికి పోలీస్‌ సేవా పతకాలు

విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు తెలంగాణ ప్రభుత్వం సేవా పతకాలను ప్రకటించింది. 2019, 2020,2021 సంవత్సరానికి రామగుండం కమిషనరేట్ లో 39 మందికి పోలీస్‌ సేవా పతకాలు వరించాయి. ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్‌ సిబ్బంది ఈరోజు సీపీ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్.,(ఐజీ) గారి చేతులమీదుగా పోలీస్‌ సేవా పతకాలను అందుకున్నారు. వీరిలో హోం గార్డ్s , పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఏసీపీ ర్యాంక్ వరకూ ఉన్నారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ…. ప్రజారక్షణ, విధి నిర్వహణలో అసామాన్యమైన ప్రతిభ కనబర్చిన పోలీస్ సిబ్బందికి గుర్తింపునిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకాలను ఇస్తున్నాయన్నారు. విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు,క్రమశిక్షణ,కమిట్మెంట్ కనబర్చిన పోలీసు సిబ్బందికి పోలీస్ సేవా పతకాల ఇవ్వడం ద్వారా పోలీసుల్లో స్ఫూర్తిని నింపడంతో పాటు వారి పని తీరు మెరుగు పర్చవచ్చన్నారు. ప్రతీ ఒక్క పోలీస్ ఉద్యోగి కూడా రిటైర్ అయ్యే లోపు పతకాలు సాధించాలని, సేవా పతకాలను అందుకోవడం వల్ల సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపడంతో పాటు తోటి వారికి ఆదర్శంగా ఉంటారన్నారు. సేవా పతకాలు అందుకున్న వారు ఇంతటితో ఆగకుండా రెట్టింపు ఉత్సాహంతో పని చేసి మరిన్ని పతకాలను సాధించాలన్నారు. అలాగే ఇతర సిబ్బంది కూడా పతకాలను అందుకున్న వారిని స్ఫూర్తిగా తీసుకొని తాము కూడా పతకాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like