భారత్ ఘనవిజయం
Great win for India over South Africa:సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా రాంచీలో ఈ రోజు జరిగిన రెండో వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన సఫారీలు బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్లో 278 పరుగులు చేసిన సౌతాఫ్రికా టీమిండియాకు 279 పరుగుల టార్గెట్ పెట్టింది. ఓపెనర్లు శిఖర్ ధవన్ (13), శుభ్మన్ గిల్ (28) తక్కువ పరుగులకే ఇద్దరు అవుటయ్యారు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ 113, ఇషాన్ కిషన్ (93) దంచికొట్టి ఇండియాని విజయతీరాలకు చేర్చారు.. సంజు 30 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. 5 ఓవర్లు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఇండియా విజయం సాధించింది.