ఆగస్టు 3 నుంచి శాసనసభ సమావేశాలు

Telangana Assembly:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు అయింది. ఆగస్టు 3 నుంచి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉండగా..అసెంబ్లీ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి. కాగా అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజు బీఏసీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఎన్ని రోజుల పటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఇటీవల రాష్ట్రాన్ని వరదలు కుదిపేసిన నేపథ్యంలో ప్రతిపక్షాలకు ఇది అస్త్రంగా మారనుంది. ప్రజల సమస్యలపై ప్రతిపక్షాలు తమ గొంతును వినిపించే అవకాశాలున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like