మంచిర్యాల క‌లెక్ట‌రేట్ ప్రారంభించిన ముఖ్య‌మంత్రి

CM KCR : మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూత‌నంగా ఏర్పాటు చేసిన క‌లెక్ట‌రేట్ భ‌వ‌నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌రేట్ శిలాఫ‌ల‌కాన్ని కేసీఆర్ ఆవిష్క‌రించారు. నూత‌న క‌లెక్ట‌రేట్‌లో నిర్వ‌హించిన ప్ర‌త్యేక పూజ‌ల్లో కేసీఆర్ పాల్గొన్నారు. చెన్నూరు, ప‌డ్త‌న్‌ప‌ల్లి ఎత్తిపోత ప‌థ‌కాల‌కు శంకుస్థాప‌న చేసిన ఆయ‌న‌, మెడికల్‌ కాలేజీ, మందమర్రి దగ్గర ఏర్పాటు చేయనున్న ఆయిల్‌ పాం ఫ్యాక్టరీ నిర్మాణ ప‌నుల‌కు సైతం భూమి పూజ చేశారు. గోదావరిపై రూ.164 కోట్లతో నిర్మించే మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జికి సైతం ఈ సంద‌ర్బంగా కేసీఆర్ శంకుస్థాప‌న చేశారు.

క‌లెక్ట‌రేట్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా స‌ర్వ‌మ‌త ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, మంత్రులు ప్ర‌శాంత్ రెడ్డి, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్, ఎంపీ వెంక‌టేశ్ నేత‌, ఎమ్మెల్యేలు బాల్క సుమ‌న్, దివాక‌ర్ రావు, దుర్గం చిన్న‌య్య‌, జోగు రామ‌న్న‌, రేఖానాయ‌క్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like