మేడారంలో గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి..
![](https://naandinews.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-15-at-9.28.11-AM1-750x430.jpeg)
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో బందోబస్తుకు వెళ్లిన హెడ్కానిస్టేబుల్ రమేష్ గుండెపోటుతో మృతి చెందాడు. రమేష్ రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడు కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లికి చెందినవారు.స్థానిక జి.ఓ ప్రకారం ఇటీవలే రమేష్ గంభీరావుపేట పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చారు. రమేష్ మృతిపట్ల మంత్రి కేటీఆర్, సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్, స్థానిక సిఐ మొగిలి, గంభీరావుపేట ఎస్.ఐ మహేష్ తో పాటు పోలీసు సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబాన్ని పోలీసుశాఖ తరపున అన్ని విధాలా ఆదుకుంటామని సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్,సిఐ మొగిలి అన్నారు.