ముఖ్యమంత్రి కోసం మృత్యుంజయ హోమం
![](https://naandinews.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-14-at-12.30.47-PM-750x430.jpeg)
ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో, ఆయురారోగ్యాలతో నిండూ నూరేళ్లు జీవించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి ఆరోగ్యం కోసం మంత్రి సత్యవతి రాథోడ్ మృత్యుంజయ హోమం నిర్వహించారు. బంజారాహిల్స్ మంత్రుల నివాస ప్రాంగణంలో సోమవారం తెల్లవారుజాము నుంచి నిర్వహిస్తున్న ఈ హోమానికి మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం కోసం నిత్యం తపించే ముఖ్యమంత్రి దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని కోరుతున్నామన్నారు.