న‌కిలీ ప‌త్తి విత్త‌నాలు ప‌ట్టివేత‌

కొమురం భీమ్ ఆసిఫాబాద్ : కొమురంభీం జిల్లా రెబ్బెన మండలంలో నిషేధిత పత్తి విత్తనాలు ప‌ట్టుకున్నారు. పోలీసులు రెక్కీ నిర్వహించి పట్టుకున్న‌ట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ అచేశ్వర్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా వివ‌రాలు వెల్ల‌డించారు. కొంతమంది వ్యక్తులు మహారాష్ట్ర నుంచి కోమర భీం జిల్లాలోని కౌటల, వాంకిడి మండలాల గుండా జిల్లాలోకి సరఫరా చేస్తున్నారన్న సమాచారం మేరకు రెక్కీ నిర్వ‌హించామ‌న్నారు. ఈ మేర‌కు 2 క్వింటాళ్ల 73 కిలోల నకిలీ విత్తనాలు సుమారు ఐదు లక్షల అరవై వేలు విలువగల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నామ‌ని వెల్ల‌డించారు. ఈ ఆపరేషన్లో చాకచక్యంగా వ్యవహరించి పట్టుకొన్న రెబ్బెన మండల CI నరేందర్,ఎస్ఐ భవాని సేన్ తోపాటు పోలీసు సిబ్బందిని అడిషనల్ ఎస్పీ అచేశ్వరరావు, డి.ఎస్.పి శ్రీనివాస్‌ అభినందించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like