క‌లెక్ట‌ర్‌, ఎస్పీల‌కు నోటీసులు

మూడు రోజుల్లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌న్న జాతీయ మైనారిటీ కమిషన్

National Minority Commission issued notices to Collector, SP: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, SP ఉదయ్ కుమార్ రెడ్డిలకు జాతీయ మైనారిటీ కమిషన్ నోటీసులు జారీ చేసింది.

ఆదిలాబాద్ మండ‌లం బంగారి గూడ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన ఓ విద్యార్థిని ముగ్గురు టీచ‌ర్లు చిత‌క‌బాదారు. ఉన్నతాధికారులు వచ్చినప్పుడు పాఠ‌శాల‌ సమస్యలు చెప్పిందని ముగ్గురు టీచర్లు ఇనుప స్కేల్ తో కొట్టారని విద్యార్థిని త‌ల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు పోలీసులు కేసు కూడా న‌మోదు చేశారు. ఆదిలాబాద్ రూర‌ల్ పోలీస్‌ స్టేషన్ లో పాఠశాల ప్రిన్సిపల్, క్లాస్ టీచర్, డ్రాయింగ్ టీచర్ల పై కేసు నమోదు చేసిన‌ట్లు పోలీసులు స్ప‌ష్టం చేశారు.

ప్రభుత్వ మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యార్థిని ప్రిన్సిప‌ల్‌, క్లాస్ టీచ‌ర్, డ్రాయింగ్ టీచ‌ర్ చిత‌క‌బాదిన ఘ‌ట‌న‌లో కేసును జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలు షహెజాదీ సుమోటోగా స్వీక‌రించారు. బాధిత విద్యార్థి ఫిర్యాదు స్వీకరించటంలో పోలీసులు జాప్యం చేశార‌ని వెల్ల‌డించారు. దీనిపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ కలెక్టర్ సిక్తా ప‌ట్నాయ‌క్‌, SP ఉదయ్ కుమార్ రెడ్డిలకు నోటీసులు జారీ చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like