ఖరారైన నీట్ 2022 పరీక్ష తేదీ..

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య కోర్సుల్లో ప్రవేశం కోసం ప్రతియేటా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ పరీక్షలు నిర్వహిస్తుంటోంది. ఈ ఏడాది అంటే 2022 నీట్ పరీక్షల ఎప్పుడు నిర్వహించేది షెడ్యూల్‌ను ఎన్టీఏ వెల్లడించింది. దేశవ్యాప్తంగా జేఈఈ పరీక్షల్ని కూడా ఎన్టీఏ నిర్వహిస్తుంటోంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన జేఈఈ పరీక్షల్ని ఎన్టీఏ మరోసారి వాయిదా వేస్తూ కొత్త షెడ్యూల్ ప్రకటించింది. దాంతోపాటే నీట్ 2022 పరీక్షల షెడ్యూల్ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా జూలై 17వ తేదీ మద్యాహ్నం 2 గంటల్నించి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకూ నీట్ 2022 పరీక్ష ఉంటుంది. ఈ పరీక్ష నిమిత్తం ఇవాళ్టి నుంచి మే 6 వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దేశంలోని 543 నగరాలు, పట్టణాలతో పాటు వివిధ దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో నీట్ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పరీక్ష ఇంగ్లీషు, హిందీ, తెలుగు సహా 13 భాషల్లో ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ, జువాలజీ విభాఘాల్లో 50 మార్కుల చొప్పున 2 వందల మార్కులకు పరీక్ష ఉంటుంది. ఒక్కొక్క ప్రశ్నకు ఒక నిమిషం సమయం ఉంటుంది. దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షలమంది ఈ పరీక్ష రాస్తుంటారు. ఈ ఏడాది నుంచి నీట్ పరీక్షకు హాజరయ్యేందుకు గరిష్ట వయోపరిమితి తొలగించారు.

నీట్ పరీక్ష విధానం
నీట్‌లో 180 ప్రశ్నలు ఇస్తారు. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీపై ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సబ్జెక్ట్‌ను రెండు విభాగాలుగా చేసి ప్రశ్నలు అడుగుతారు. ఏ విభాగంలో 35 ప్రశ్నలు అడుగుతారు. అందులో అన్నింటికీ ఆన్సర్స్ రాయాలి. రెండో విభాగంలో 15 ప్రశ్నలు అడుగుతారు. వాటిలో 10 ప్రశ్నలకు జవాబులు రాస్తే చాలు. మిగతా ఐదు ఛాయిస్‌లో వదిలేయవచ్చు.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.nta.ac.in, neet.nta.nic.in వెబ్ సైట్‌లోకి వెళ్లి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే సమయంలో జనరల్ అభ్యర్థులు రూ.1600, జనరల్-ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ-ఎన్సీఎల్ అభ్యర్థులు రూ.1500, ఎస్సీ/ఎస్టీ/PwBD అభ్యర్థులు రూ.900 ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది.

నీట్‌ యూజీ 2022 ద‌ర‌ఖాస్తు చేసుకోండి ఇలా..-
1. ntaneet.nic.in వెబ్‌సైట్‌ లోకి వెళ్లాలి.
2. ముందుగా విద్యార్థి పేరు, తండ్రిపేరు, ఫోన్‌ నెంబర్‌ వివరాలు ఇచ్చి ఐడీ క్రియేట్ చేసుకోవాలి.
3. అలా క్రియేట్ చేసుకున్న లాగిన్ ఐడీతో లాగిన్అవ్వాలి.
4. అందులో ఉన్న అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. అందులో విద్యార్హతలు, మార్క్‌ల వివరాలు, పొందుపరచాలి.
5. డాక్యుమెంట్స్‌ అప్‌లోడ్ చేయాలి, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోగ్రాఫ్‌ , సంతకాన్ని స్కాన్ చేసి జత చేయాలి.
6. తర్వాత అప్లికేషన్ ఫీజును ఆన్‌లైన్‌లో మోడ్‌లో పే చేయాలి.
7. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత ఒకటికి రెండు సార్లు సరి చూసుకొని అప్లికేషన్ సబ్‌మిట్ చేయాలి.
8. అనంతరం అప్లికేషన్‌ను డౌన్‌లౌడ్‌ చేసి ఒక ప్రింట్‌ అవుటు ఒకటి తీసి పెట్టుకోవాలి.

నీట్‌ యూజీ అప్లై చేయడానికి కావాల్సిన ప‌త్రాలు ఇవే..
1. పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోను జేపీజీలో కానీ, జేపీఈజీ ఫార్మాట్‌లో కానీ 10 కేబీ నుంచి 200 కేబీ మధ్య ఉండేలా రెడీ చేసుకోవాలి.
2. అదే మాదిరిగా అభ్యర్థి సంతకాన్ని కూడా స్కాన్ చేసి జేపీజీ లేదా జేపీఈజీ ఫార్మాట్‌లో 4 కేబీ నుంచి 30 కేబీ మధ్య ఉండేలా పెట్టుకోవాలి.
3. అభ్యర్థి ఎడమచేతి వేలి ముద్ర కూడా స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఇది కూడా జేపీజీ ఫార్మాట్‌లోనే ఉండాలి. 10 కేబీ నుంచి 50 కేబీ మధ్యలో ఉండాలి.
4. పదోతరగతి పాస్‌ సర్టిఫికేట్‌ జేపీజీ ఫార్మాట్‌లో 100 కేబీ నుంచి 300 కేబీ మధ్యలో ఉండేలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like