నేను నాగలి కడతా.. నువు కడతవా
కేసిఆర్ కు కిషన్ రెడ్డి సవాల్
![](https://naandinews.com/wp-content/uploads/2021/12/kishan-reddy-kcr-750x430.jpg)
నేను నాగలి కడుతా… నాతో కలిసి నాగలి కట్టేందుకు కేసీఆర్ సిద్ధమా ? అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. వచ్చే రబీ గురించి దేశంలో ఏ రాష్ట్రానికి టార్గెట్ ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలతోనే తెలంగాణకు టార్గెట్ ఇస్తామన్నారు. సమస్య అంతా బాయిల్డ్ రైస్ తో వచ్చింది. తెలంగాణలో ఒక్క కుటుంబం కూడా బాయిల్డ్ రైస్ తినదని స్పష్టం చేశారు. అనవసరంగా రైతులను భయపెట్టవద్దని స్పష్టం చేశారు. పంటమార్పిడి కి బీజేపీ.. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తుందని పేర్కొన్నారు. గడిచిన ఏడేళ్లుగా కేసీఆర్ ధాన్యం మొత్తం తానే కొంటున్నా అని చెప్పి ఇవ్వాళ మాత్రం కేంద్రమే కొనడం లేదని ధర్నా చేశారని మండిపడ్డారు. పంటను కొనే బాధ్యత కేవలం కేంద్రంది మాత్రమే కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా పంటను ఎందుకు కొనడం లేదని? ప్రశ్నించారు. రా రైస్ తయారు చేస్తే దానికి సంబంధించిన టెక్నికల్ వ్యవస్థ గోదాముల ఉన్నాయా? ఇప్పుడు కేంద్రం బాయిల్డ్ రైస్ కొంటుందని.. చెప్పారు. తెలంగాణ ఏర్పడిన రోజు జీహెచ్ఎంసీలో మిగులు బడ్జెట్ ఉండేనని.. ఇప్పుడు అధికారులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు. కార్పొరేషన్ పేరుతో అప్పులు తెచ్చారని.. ఉన్న వాటిని అభివృద్ధి చేయకుండా కంటోన్మెంట్ కావాలని అడుగుతున్నారని అగ్రహిం చారు. హైదరాబాద్ నగరం రోడ్లు అధ్వాన్నంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.