నేటి నుంచి ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 8, 9, 10 తరగతుల విద్యార్థుల కోసం సోమవారం నుంచి టీశాట్ ద్వారా డిజిటల్‌ పాఠాలను విద్యాశాఖ ప్రసారం చేయనుంది. 30వ తేదీ వరకు విద్యాసంస్థలకు సెలవులు పొడిగించిన నేపథ్యంలో టీవీ పాఠాలను ప్రసారం చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ ఆదివారం రాత్రి పాఠాల టైం టేబుల్ విడుదల చేసింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠాలు ప్రసారం కానున్నాయి. ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ మాధ్యమంలో పాఠాలను ప్రసారం చేస్తున్నారు. ఒక్కో తరగతికి ఒక్కో మాధ్యమానికి రెండు తరగతులు ప్రసారమవుతాయి. ఒక్కో పాఠం 30 నిమిషాలపాటు ఉంటుంది. ఈ నెల 30వ తేదీ వరకు సెలవులు ఉండగా… ఈ నెల 24, 25, 27, 28 తేదీల్లో టీవీ పాఠాలు వస్తాయి. ఈ నెల 26న రిపబ్లిక్‌ దినోత్సవం కాగా…ఈ నెల 29, 30 శని, ఆదివారాలు పాఠాలు ఉండవు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like