నిర్మల్ లో యువకుడి దారుణ హత్య
![](https://naandinews.com/wp-content/uploads/2022/05/Screenshot_2022-05-12-20-31-10-86_6012fa4d4ddec268fc5c7112cbb265e7-750x430.jpg)
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఓ యువకుణ్ణి కత్తెరతో గొంతు కోసి హత్య చేసిన మరో యువకుడు.. జిల్లా కేంద్రంలో బైల్ బజార్లో జుబేర్ అనే యువకుణ్ణి హత్య చేశారు. జుబేర్ (20)ను హత్య చేసిన ఫయాజ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. జిల్లా కేంద్రంలో యువకుడి దారుణ హత్యపై విచారణ చేపట్టిన పోలీసులు. అక్రమ సంబందం నేపథ్యంలోనే హత్య జరిగినట్టు తెలుస్తోందని డీఎస్పీ ఉపేందర్ రెడ్డి వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.