నువ్వు అప్పుడు వెన్నుపోటు పొడిచే బిజీలో ఉన్న‌వ్‌

కేటీఆర్‌పై రేవంత్ వ్యాఖ్య‌ల‌కు బాల్క సుమ‌న్ కౌంట‌ర్

కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేద‌న‌డంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై ప్ర‌భుత్వ విప్ బాల్కసుమ‌న్ విరుచుకుప‌డ్డారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా వ్యంగాస్త్రాలు సంధించారు. కేటీఆర్ తెలంగాణ ఉద్య‌మం చేస్తున్న స‌మ‌యంలో ఓటుకు నోటు కేసు నిందితుడు రేవంత్ రెడ్డి వేరే ప‌నిలో బిజీగా ఉన్నార‌ని ఎద్దేవా చేశారు. అప్పుడు నువ్వు సమైక్యవాదులతో కలిసి తెలంగాణ ఉద్యమాన్ని వెన్నుపోటు పొడిచే పనిలో బిజీగా ఉంటివి కదా అని అన్నారు.. అందుకే కేటీఆర్ ఉద్యమంలో పాల్గొన్న విషయం గమనించి ఉండవులే అని వెల్ల‌డించారు.

అంత‌కుముందు ఆయ‌న మీడియాతో కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నాయకులను చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ని స్కామ్ గ్రెస్ పార్టీ గా ప్రజలు చూస్తున్నారని ఆరోపించారు. అమరవీరుల స్థూపం గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా అని ఆయన ప్రశ్నించారు. గన్ పార్క్ ముందు నుండి వెళ్లిన రాహుల్ గాంధీ అమరవీరులకు ఎందుకు నివాళులు అర్పించలేదన్నారు. యాదాద్రి మొత్తం ఖర్చు 1200 కోట్ల అని, వర్షాలు వస్తే తిరుమలలో రోడ్లు కొట్టుకపోలేదా ఆయన వ్యాఖ్యానించారు. అకాల వర్షాల వల్ల యాదాద్రిలో పనుల్లో ఇబ్బందులు వస్తే అవినీతి అంటారా అని ఆయన మండిపడ్డారు.

2004లో తెలంగాణ ఇస్తాం అని చెప్పి మాతో పొత్తు పెట్టికొని మీరు మోసం చేస్తే మేము రాజీనామా చేసి బయటకు వచ్చింది వాస్తవం కదా అని ఆయన ప్రశ్నించారు. మీ చిల్లర రాజకీయల కోసం మీరు చేసే ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు చూస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మీ దగ్గర అవినీతి ఆధారాలు ఉంటే దర్యాప్తు సంస్థల దగ్గరకు ఎందుకు పోవడం లేదన్నారు. రైతుల పట్ల మీరు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని, ఛత్తీస్ ఘడ్ లో రైతులకు రెండు గంటల కరెంటు రావడం లేదని, ఛత్తీస్ ఘడ్ లో రుణమాఫీ లేదన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like