పాద‌యాత్ర‌కు ముహూర్తం

అంబేడ్కర్​ జయంతి రోజు బండి‌ సంజయ్ రెండో విడత పాదయాత్ర

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ రాష్ట్రంలో రెండో విడత పాదయాత్రకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిశాక ప్రజా సంగ్రామ యాత్రకు సన్నద్ధమవుతున్నారు. ఏప్రిల్ 14న అంబేడ్కర్​ జయంతి రోజు బండి‌ సంజయ్ రెండో విడత పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని ఆయ‌న‌ నిర్ణయించుకున్నారు. మొదటి విడత పాదయాత్ర 36 రోజులు పాటు సాగింది. రెండో విడతలో 200 రోజుల పాటు పాదయాత్ర చేయాలని బండి సంజయ్ నిర్ణయించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి రెండో విడత పాదయాత్ర చేసే అవకాశం ఉంది. బీజేపీ జోనల్ నేతల సమావేశంలో సంజయ్ పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 6 నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయించామని తొలుత హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం జరుగుతుందన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like