ప‌గ‌బ‌ట్టిన పాము… మూడో సారి కాటుకు యువ‌తి మృతి

పాములు ప‌గ‌ప‌డ‌తాయ‌ని అంటారు. చాలా సంద‌ర్బాల్లో అది నిజం కాక‌పోవ‌చ్చ‌ని కానీ.. ఈ యువ‌తి విష‌యంలో మాత్రం అదే జ‌రిగింది. ఆదిలాబాద్ జిల్లా బేల మండ‌లం బెదోడ గ్రామానికి చెందిన యువ‌తిని మూడు సార్లు పాము క‌రిచింది. రెండు సార్లు ఆ యువ‌తి ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకోగా మూడోసారి మాత్రం మృతి చెందింది.

ఆదిలాబాద్ జిల్లా బేల మండలం బెదోడ గ్రామానికి చెందిన ప్రణాళి ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చ‌దువుతోంది. ప్ర‌ణాళికి గతంలో రెండు సార్లు పాము కరిచింది. రెండు దఫాలు ఆమె కాటు నుంటి ప్రాణాలతో బయట పడింది. కానీ చివరికి ఈ నెల 18వ తేదీన ఆమెను పాము కరిచింది. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ చ‌నిపోయింది.

గత ఏడాది సెప్టెంబర్ లో ప్రణాళి తన నివాసంలో నిద్రిస్తున్న సమయంంలో పాము కాటుకు గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. సుమారు రూ. 4 లక్షలు ఖర్చు చేసి ఆమెను రక్షించుకున్నారు. ఆ తర్వాత ఈ ఏడాది జనవరిలో మరో సారి ఆమె పాము కాటుకు గురైంది. ఇంటి ఆవరణలో కూర్చొన్న సమయంలో ఆమెను పాము కరిచింది. ఈ సమయంలో కూడా ఆమె చికిత్స నుండి కోలుకుంది. ఇలా రెండుసార్లు పాము కాటు వేసినా ప్రాణాపాయ స్థితి నుంచి త‌ప్పించుకుంది.

ఈ నెల 18వ తేదీన హోళీ ని పురస్కరించుకొని తన స్నేహితులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రణాళి ప్లాన్ చేసుకొంది. తన కాలేజీ బ్యాగులో రంగులను తెచ్చుకొంది. అయితే ఈ బ్యాగులో పాము ఉంది. ప్రణాళి బ్యాగులో రంగులను బయటకు తీస్తున్న సమయంలో పాము కాటు వేసింది. ఆమెను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రణాళి మరణించింది. రెండు సార్లు పౌర్ణ‌మి రోజు కాటేయ‌గా, ఒక‌సారి అమావాస్య రోజు కాటేయ‌డంతో ఆ పాము ప‌గ ప‌ట్టింద‌ని అందుకే మూడు సార్లు వెంట‌ప‌డింద‌ని ప్ర‌ణాళి బంధువులు చెబుతున్నారు. చదువులో చురుకుగా ఉండేదని స్నేహితులు చెబుతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like