ఏడుగురు పేకాట‌రాయుళ్ల అరెస్ట్

1.41 ల‌క్ష‌ల నగదు, ఏడు సెల్ ఫోన్లు, మూడు వాహనాలు స్వాధీనం

గోదావ‌రిఖ‌ని – పెద్దపల్లి జిల్లా గోదావ‌రిఖని 1 టౌన్ పోలీస్స్టషన్ పరిధిలో పేకాట స్తావ‌రంపై పోలీసులు దాడి చేసి ఏడుగురుని అరెస్టు చేశారు. గురువారం రాత్రి లక్ష్మి నగర్ ప్రాంతం డబ్బులు పందెంగా పెట్టుకుని పేకాట ఆడుతున్నారన్న టాస్క్ ఫోర్స్ SI మస్తాన్ సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు చేశారు. అక్కడే ఉన్న ఏడుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 1,41,480 రూపాయల నగదు, ఏడు సెల్ ఫోన్లు, మూడు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.ఇంటి య‌జ‌మాని శ్రీరామోజీ జగన్ ఉట్ల శ్రీనివాస్ రెడ్డి, ఎంఎస్‌ ఖాన్, గూండా రమేష్, బొడ్ల ఆంజనేయులు,ఆరెల్లి శ్రీనివాస్, తిరుపతిల‌ను అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఈ దాడుల్లో గోదావరిఖని 1టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు,టాస్క్ఫోర్స్ ఎస్ఐ షేక్మస్తాన్, ఎస్ఐ రమేష్, సిబ్బంది శ్రీనివాస్, మహేందర్, ప్రకాష్, మల్లేష్, సిబ్బంది నరేందర్ పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like