కాంగ్రెస్తోనే ప్రజలకు మంచి రోజులు
జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ
Manchiryal: కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మంచి రోజులు వస్తాయని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ అన్నారు.ఆదివారం హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా నస్పూర్ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డులో సురేఖ ఇంటిటికీ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి, సంక్షేమానికి బీజం పడిందన్నారు.
ప్రజలు తీసుకువచ్చిన అనేక సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్ళీ ప్రజలకు మంచి రోజులు వస్తాయని సురేఖ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ పట్టణ అధ్యక్షుడు బండారి సుధాకర్, ఫ్లోర్ లీడర్ సురిమిల్ల వేణు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తాళ్ల సంపత్ రెడ్డి, 13వ వార్డు ఇంచార్జ్ దొమ్మటి కిరణ్,పట్టణ కార్యదర్శి దారవేణి తిరుపతి, రామ్మూర్తి, దేవేందర్, రజిత సునిత, రాజేశ్వరి, కళావతి పాల్గొన్నారు.