ప్రీతి కన్ను మూసింది

వరంగల్‌ కాకతీయ వైద్య కాలేజీకి చెందిన వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి మృతి చెందింది. ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని ఆదివారం వైద్యులు ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆమె చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఆస్పత్రి వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మొహరించారు.

అంతకుముందు ప్రీతిని చూసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ప్రీతి బతుకుతుందన్న నమ్మకం ఒక్క శాతమేనని తెలిపారు. ఆమె ఆరోగ్యం అంతకంతకూ విషమంగానే ప్రకటించారు కూడా. ప్రీతి ఘటన అత్యంత బాధాకరమన్నారు. ఆమె మృతి కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.

కాగా, తన సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేని ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెల్సిందే. సైఫ్‌తో పాటు మరికొందరు సైనియర్ విద్యార్థులు చేసిన ర్యాగింగ్ కారణంగా వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమె ఐదు రోజులుగా నగరంలోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాగా, ఆమె ఆదివారం రాత్రీ చనిపోయినట్లు ప్రకటించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like