పిడుగు పాటుకు రైతు మృతి
![](https://naandinews.com/wp-content/uploads/2022/06/IMG-20220611-WA0080-750x430.jpg)
ఆదిలాబాద్ జిల్లాలో గాలి వాన భీబీభత్సం సృష్టించింది. భీంపూర్ మండలం ధనోరలో పిడుగుపాటుకు రైతు మృతి చెందాడు. చేనులో పని కోసం వెళ్ళిన ఆశన్న అనే రైతు పై పిడుగు పడింది. దీంతో అక్కడిక్కడే చనిపోయాడు.
గాలి,వాన దుమారంతో ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలిలో ఇండ్ల పై కప్పులు లేచి పోయాయి. హనుమాన్ మందిరంపై రేకులు ఎగిరి పోయాయి. చెట్లు,విద్యుత్ స్థంబాలు విరిగి పడ్డాయి.