గ్రూప్ 2 ప‌రీక్ష వాయిదా

టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ సీఎస్ శాంతి కుమారిని ఆదేశించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు. లక్షలాది మంది అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు టీఎస్ పీఎస్సీతో సంప్రదించి గ్రూప్-2 పరీక్షను రీషెడ్యూల్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం కేసీఆర్ ఆదేశించారు…అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. భవిష్యత్తులో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు సరిగ్గా ఉండేలా చూడాలని చీఫ్ సెక్రటరీకి ముఖ్యమంత్రి కేసీఆర్ సలహా ఇచ్చారు. అలాగే ప్రతి ఔత్సాహికుడికి అర్హత ఉన్న అన్ని పరీక్షలకు సిద్ధం కావడానికి తగిన సమయం లభిస్తుంది.అని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like