రేపటి నుంచి ఫీవర్ సర్వే
![](https://naandinews.com/wp-content/uploads/2022/01/IMG-20220120-WA0046-750x430.jpg)
తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి ఫీవర్ సర్వే నిర్వహించనున్నారు. కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీవర్ సర్వేతో జ్వర లక్షణాలు ఉన్నవారిని గుర్తించనున్నారు. వారికి కరోనా కిట్లు అందించి వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తారు. ఆదివారం కూడా బస్తీ దవాఖానాలు పనిచేస్తాయని మంత్రి చెప్పారు. చూపుతో రెండు లక్షల కిట్లు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. గతంలో ఫీవర్ సర్వేతో దేశంలోనే ఆదర్శంగా నిలిచామన్నారు. ఇప్పుడు కూడా అదే స్ఫూర్తితో ఫీవర్ సర్వే చేసి కోవిడ్ కట్టడికి తోడ్పడాలని మంత్రి కోరారు.