సమతామూర్తి విగ్రహంపై రాహుల్ విమర్శలు.. కిషన్రెడ్డి కౌంటర్
![](https://naandinews.com/wp-content/uploads/2022/02/samatha-Murthy.jpg)
ముచ్చింతల్లో కొలువుదీరిన శ్రీరామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహాన్ని అవమానపరుస్తూ ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘మేడిన్ ఇన్ చైనా’ అంటూ రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ను తప్పుబట్టిన కిషన్ రెడ్డి.. ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’కి సంబంధించి నాలుగు అంశాలతో కూడిన వివరణ ఇచ్చారు.
‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ అనే ప్రాజెక్ట్ 8 ఏళ్ల క్రిందట ప్రైవేటు ఆధ్యాత్మిక ప్రాజెక్ట్గా మొదలైందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడు అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని గుర్తు చేశారు. ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ ప్రాజెక్ట్కు పూర్తిగా ప్రైవేటు ఫండ్ రైజింగ్ ద్వారా వచ్చినవేనని.. దీనికి కేంద్రం ఎలాంటి ఆర్ధిక సాయం అందించలేదని స్పష్టం చేశారుజ ప్రధాని నరేంద్ర మోడీ ‘ఆత్మనిర్భర్ భారత్’ పిలుపు కంటే ముందే ఈ ప్రాజెక్ట్ను చేపట్టారని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ ప్రాజెక్ట్పై రాహుల్ గాంధీ చేసిన ట్వీట్.. కేవలం ఆయన అజ్ఞానాన్ని చాటుకుందని ఎద్దేవా చేశారు. నిజానిజాలను నిర్ధారించుకోకుండా.. కేవలం కల్లబొల్లి కబుర్లు చెబుతూ తన పార్టీని తానే మట్టికరిపిస్తున్నారంటూ సెటైర్లు వేశారు. గతంలో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో ఎంవోయూ కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందంటూ దెప్పిపొడిచారు.