సింగరేణి లో ప్రమాదం, ఎస్కార్ట్ క్రేన్ బోల్తా
![](https://naandinews.com/wp-content/uploads/2022/04/IMG_1648915164838-750x430.jpg)
రామగుండం 3 ఓసిపి-2 లో సెకండ్షిఫ్ట్ లో ప్రమాదం సంభవించింది. సుమారు 04:45 ప్రాంతంలో ఎస్ ఎం ఈ సెక్షన్ కు సంబంధించిన ఎస్కార్ట్ క్రేన్ నం 4 క్వారీలో కి దిగుతుండగా బ్రేక్ ఫెయిల్ అయి పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ నరేష్ తల,ఎడమ చెయ్యి భుజానికి గాయాలయ్యాయి. బాధిత కార్మికుడు నరేష్ ను చికిత్స కోసం ఏరియా హాస్పిటల్ కి తరలించారు.
గత నెల 31న ఉదయం షిఫ్ట్ లో ఎల్జీ వ్యాన్ కూడా క్వారీలో బ్రేక్ ఫెయిల్ అయ్యిందని కార్మికులు వెల్లడించారు. యాజమాన్యం ఉత్పత్తి మీద పెట్టిన శ్రద్ధ రక్షణ పై పెట్టడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం రక్షణ ఫై దృష్టిసారించి ప్రమాదాలను నివారించాలని డిమాండ్ చేస్తున్నారు.