తీన్మార్ మల్లన్నపై మంత్రి పిర్యాదు

చింతపండు నవీన్ కుమార్ అలియాస్‌ తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ ఛానల్ క్యూ న్యూస్, శనార్తి తెలంగాణ దినపత్రికలో కబ్జాల పేరిట రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పైన అవాస్తవ కథనాలు ప్రచురించి అసత్యపు ఆరోపణలు చేస్తుండటంతో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ను కలిసి మంత్రి వ్యక్తిగత కార్యదర్శి కిరణ్ కుమార్ ఫిర్యాదు చేశారు.

మే 13న తీన్మార్ మల్లన్నకు చెందిన దినపత్రికలో కన్ను పడితే కబ్జానే, ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అక్రమాలు అనే శీర్షికతో నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేశారని, అవి మంత్రి వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. గత నెలలోనూ తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ క్యూ న్యూస్ ఛానల్ లో అసత్య ఆరోపణలు చేశారని, అదేవిధంగా మంత్రి పువ్వాడను విమర్శిస్తూ మల్లన్న మాట్లాడిన భాష జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధమైందని, దీనిని ఎవరూ అంగీకరించరన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మీద తీన్మార్‌ మల్లన్న క్యూ న్యూస్‌ యూట్యూబ్‌ చానల్‌, సోషల్ మీడియా వేదికగా అభ్యంతరకర భాష వాడుతున్నారని, దీనివల్ల టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, మంత్రి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like