తిరుమలకు పోటెత్తిన భక్తులు.. ద‌ర్శ‌నానికి 12 గంట‌ల స‌మ‌యం

శ‌నివారం హుండీ ఆదాయం రూ. 4.20 కోట్లు

శ్రీవారి దర్శనానికి భక్తులకు పోటెత్తారు. ద‌ర్శ‌నానికి 12 గంట‌ల స‌మ‌యం ప‌డుతుంద‌ని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 33 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వేసవి సెలవులు, వారాంతాలు కావడంతో సప్తగిరులపై ఊహించని రీతిలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ -1,2లోని 31 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోగా.. 3 కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. మరోవైపు నడక మార్గం గుండా అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తున్నారు.

శనివారం తిరుమల శ్రీవారిని 83,739 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. అలాగే 46,187 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని పేర్కొంది. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.20 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like