తొలకరి చినుకు.. ఆరుద్ర మెరుపు

ఆరుద్ర కార్తె పేరు వినగానే మొదట గుర్తుకొచ్చేవి ఆరుద్ర పురుగులే. వాతావరణం చల్లబడి, తొలకరి జల్లులు కురియగానే నల్లని నేలపై ఇవి ఎర్రని బొట్లుగా మెరుస్తూ కనిపిస్తాయి. వర్షాలు కురుస్తుండటంతో ఈ మృగశిర కార్తెలోనే ఆరుద్ర పురుగులు నేలపై తిరుగుతూ సందడి చేస్తుంటాయి. రైతులకు ఆనందం కలిగిస్తుంటాయి. అన్నదాతలకు మేలు చేసే ఈ పర్యావరణ నేస్తాలు..

రైతులు దుక్కులు దున్నాక పొలాల్లో సందడి చేస్తాయి. వీటిని ఏ రైతు చంపడు.. ఎవ్వరినీ చంపనీయడు.. దేవతలకు, వరుణ దేవుడికి ప్రతిరూపంగా వీటిని భావిస్తారు.. కొలుస్తారు.. ఈ పురుగులు గ్రామాల్లో కనిపించాయంటే రైతులు సంతోషంతో గంతులేస్తారు. ఎందుకంటే ఆరుద్ర పురుగులు కనిపించాయంటే ఆ సంవత్సరం సంవృద్ధిగా వర్షాలు పడతాయని సంకేతం.. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండుతాయనే ధీమా రైతుల్లో నెలకొంటుంది.

ఈ ఆరుద్ర పురుగును కొన్ని చోట్ల పట్టు పురుగు అనీ, చందమామ పురుగు అనీ, లేడీ బర్డ్ అనీ, ఇంద్రగోప పురుగు అని కూడా అంటారు. ఇలా చాలా పేర్లు ఉన్న ఈ పురుగు చూడటానికి ఎర్రని మఖ్మల్ బట్టతో చేసిన బొమ్మలాంటి పురుగులా ఉంటుంది. ముట్టుకుంటేనే అత్తిపత్తి చెట్టు ఆకుల్లా ముడుచుకు పోయే స్వభావం ఉన్న ఈ పురుగులు నేలమీద కాసింత ఇసుక నేలల్లో, పచ్చగడ్డి ఉన్న చోట్లలో విరివిగా కనిపిస్తాయి. మనిషి స్వార్థం కోసం విచ్చలవిలవిడి ఎరువులు, రసాయనాలు వాడుతూ పుడమి తల్లిని కాలుష్యకాసారంగా మారుస్తున్నాడు. దీంతో వీటి ఉనికికే ప్రమాదం ఏర్పడింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like