ఆత్మీయ స‌మ్మేళ‌నంలో విషాదం.. ఒక‌రి మృతి..

ఎనిమిది మందికి తీవ్ర గాయాలు

BRS Spirit Society: ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ ఆత్మీయ స‌మ్మేళ‌నంలో అప‌శృతి చోటు చేసుకుంది. జిల్లాలోని వైరా అసెంబ్లీ నియోజకవర్గ పరిధి కారేపల్లి మండలం చీమలపాడులో బుధవారం పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా పార్టీ శ్రేణులు ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, నాయకులకు ఘనంగా స్వాగతం పలికారు. టపాసులు పేలుస్తున్న సంద‌ర్భంలో పక్కనే ఉన్న పూరిగుడిసె పై బాంబులు పడ్డాయి. ఇంటిపై నిప్పుపడి ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్ర‌మాదంలో ఒకరు మృతి చెందారు. ఎనిమిది మందికి తీవ్ర గాయాల‌య్యాయి.కాళ్లు, చేతులు తెగిప‌డ‌టంతో అక్క‌డ ప‌రిస్థితి భ‌యాన‌కంగా మారింది. క్ష‌త‌గాత్రుల‌ను హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like