తెలంగాణ‌లో మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల బ‌దిలీలు

Telangana: తెలంగాణలో భారీగా మున్సిపల్‌ కమిషనర్లను బ‌దిలీ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. 22 మంది కమిషనర్లను బదిలీ చేస్తూ ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీడీఎంఏ కార్యాలయంలో జాయింట్‌ డైరెక్టర్‌గా మోహనకృష్ణ రెడ్డిని నియమించారు. గీతను సీడీఎంఏ నుంచి జీహెచ్‌ఎంసీకి బదిలీ చేశారు. బడంగ్‌పేట మున్సిపల్‌ కమిషనర్‌గా సుమన్‌రావు, రామగుండం కార్పొరేషన్‌ కమిషనర్‌గా నాగేశ్వర్ బ‌దిలీ అయ్యారు. మిర్యాలగూడ కమిషనర్‌ రవీంద్ర సాగర్‌కు ఉద్యోగోన్నతి కల్పిస్తూ ఇబ్రహీంపట్నం కమిషనర్‌గా బదిలీ చేశారు. రాజేంద్ర కుమార్‌ను నగరం కమిషనర్‌గా, పోచారం అసిస్టెంట్‌ కమిషనర్‌ సురేష్‌ను జీహెచ్‌ఎంసీకి,సాబీర్‌ అలీని ఘట్కేర్‌సర్‌ కమిషనర్‌గా నియమించింది. పాల్వంచ మున్సిపల్‌ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీకాంత్‌కు ప్ర‌మోష‌న్ ఇచ్చారు. ఆయ‌న‌ను తుర్కయాంజల్‌ కమిషనర్‌గా నియమించారు. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌గా కే నారాయణరావు, దమ్మాయిగూడ కమిషనర్‌ ఏ స్వామికి ఉద్యోన్నతి కల్పిస్తూ పాల్వంచ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించింది.

ఎంపీ పూర్ణచందర్‌రెడ్డిని మిర్యాలగూడ, ఎస్‌ రవీంద్రరెడ్డిని పెద్దఅంబర్‌పేట, సత్యనారాయణరెడ్డి ఖమ్మం, వేణుమాధవ్‌ను నందికొండ, పీ వేమన్‌రెడ్డిని పోచారం కమిషనర్‌గా బదిలీ చేసింది.త్రయంబకేశ్వర్‌ను రామగుండం డిప్యూటీ కమిషనర్‌గా, రాజమల్లయ్యను దమ్మాయిగూడ కమిషనర్‌గా నియమించింది. ఇబ్రహీంపట్నం కమిషనర్‌ మహ్మద్‌ యూసఫ్‌ను పదోన్నతిపై జీహెచ్‌ఎంసీకి పంపింది. ఆర్‌ రాజశేఖర్‌ను హుస్నాబాద్‌కు ఏ వెంకటేశ్‌ను కొత్తపల్లి మున్సిపల్‌ కమిషనర్‌గా, మీర్‌పేట కమిషనర్‌గా ఏ వాణి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like