రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Two killed in a road accident: ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యు వాత పడ్డారు. నేరడిగొండ మండలం కుప్టి బ్రిడ్జి పై న టిప్పర్, కంటైనర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో టిప్పర్ బ్రిడ్జి పై నుంచి పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మరణించారు. ఉషారెడ్డి, రాజేశ్వర్ అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. అందులో ఉన్న మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like