వారిపై చర్యలు తీసుకోండి
![](https://naandinews.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-01-at-11.45.36-AM-750x430.jpeg)
ఆదిలాబాద్ : తాను పార్టీ మారుతున్న చేస్తున్న తప్పుడు ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత చిట్యాల సుహాసిని రెడ్డి కోరారు. ఆమె జిల్లా ఎస్పీ ఉదయ్కుమార్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. వివిధ ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఈ సందర్బంగా కోరారు.