కేసీఆర్ తోనే సంక్షేమ పథకాలు
బీఆర్ఎస్ నేత నడిపెల్లి విజిత్ కుమార్
![](https://naandinews.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-28-at-11.46.14-AM-750x430.jpeg)
Welfare schemes with KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ దాదాపు 90 శాతం హామీలను పూర్తి చేశారని మంచిర్యాల ఎమ్మెల్యే తనయుడు, బీఆర్ఎస్ నేత నడిపెల్లి విజిత్ కుమార్ స్పష్టం చేశారు. ఆయన శనివారం మంచిర్యాల నియోజకవర్గంలోని హాజీపూర్ మండలం ముల్కల్ల గ్రామంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ సందర్భంగా విజిత్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి అవినీతికి తావు లేకుండా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. ఎలాంటి భేద భావం లేకుండా సబ్బండ వర్గాల సంక్షేమానికి వివిధ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని, ఇది కేసీఆర్ దార్శనిక పాలనకు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా విజిత్ ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు.