సింగరేణిలో మళ్లీ ప్రమాదం
సింగరేణిలో మళ్లీ ప్రమాదం సంభవించింది. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 గనిలో ఈ ప్రమాదం జరిగింది. సీ రిలేకు చెందిన నల్లూరి సంతోష్ అనే ట్రామర్ కార్మికుడు టబ్బుల మధ్య జారిపడటంతో కాలు ఫ్రాక్చర్ అయ్యింది. పని స్థలం సరిగ్గా లేకపోవడంతో కార్మికుడికి ప్రమాదం సంభవించినట్లు సమాచారం.