బోనమెత్తిన మంత్రి
Minister Vivek: ఆషాఢమాసం బోనాల సందర్భంగా బొక్కలగుట్టలోని గాంధారి మైసమ్మ ఆలయంలో మంత్రి వివేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మైసమ్మ తల్లికి బోనం సమర్పించి, రాష్ట్ర ప్రజల క్షేమం, శాంతి, సమృద్ధిగా ఉండాలని ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ – “తెలంగాణ భూమి పరంపరగా శక్తి స్వరూపమైన గ్రామ దేవతల ఆరాధనలో ముందుంటోందన్నారు. ఇలాంటి భక్తి ఉత్సవాలు ప్రజల మానసిక శాంతికి, సామూహిక ఐక్యతకు పెద్ద వేదికగా నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో పలువురు భక్తులు, మహిళా సంఘాలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.