ఫొటో ఎక్స్‌పో పోస్ట‌ర్ల ఆవిష్క‌ర‌ణ‌

కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్‌ ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో ఈనెల 19, 20, 21 తేదీలలో హైదరాబాద్ నార్సింగిలో జరగబోయే ఫోటో ఎక్స్‌పో పోస్టర్లు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్స్ఫో ద్వారా కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక పరికరాలపై ఫొటోగ్రాఫర్స్ అవగాహన పెంచుకోవచ్చన్నారు. ఫొటోగ్రఫీ రంగానికి మరింత ప్రాధాన్యత లభించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాగజ్‌నగర్‌ ఫోటో వీడియో అసోసియేషన్ సభ్యులు కొమరంభీం జిల్లా అధ్యక్షుడు. సమీర్.జిల్లా ప్రధాన కార్యదర్శి నీలి సతీష్, కోశాదికారి రాచర్ల వినయ్, కాగజ్‌నగర్‌ మండల అధ్యక్షుడు అనుమల్ల రాధాకృష్ణ,మండల ప్రధాన కార్యదర్శి కుందారపు రాజు, కోశాదికారి నారాయ‌ణ, కాగజ్‌నగర్‌ మండల యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like