‘’యూట్యూబ్ ఛానళ్ళు – అక్రెడిటేషన్ల ‘’పై రౌండ్ టేబుల్ సమావేశం

రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇవ్వడానికి విధివిధానాలు, అనుసరించాల్సిన నియమ నిబంధనలు , యూట్యూబ్ ఛానల్స్ గుర్తింపు, తదితర అంశాలపై చర్చించడానికి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, సెప్టెంబర్ 23న నిర్వహిస్తున్నామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

‘’యూట్యూబ్ ఛానల్స్-అక్రెడిటేషన్ల’’ అంశంపై మీడియా అకాడమీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని సెప్టెంబర్ 23న, బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో నిర్వహిస్తున్నామని. ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టులు, నిష్ణాతులు ఈ సమావేశంలో పాల్గొని సంబంధిత విషయాలపై చర్చించి, జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇవ్వడానికి సూచనలు చేయాలని అకాడమీ చైర్మన్ చెప్పారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like