28న జాతీయ లోక్ అదాలత్.. సద్వినియోగం చేసుకోండి
-లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం
-రాజీమార్గమే రాజామార్గం
-పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్

రాజీ మార్గం రాజ మార్గమని, కక్షలు కార్పణ్యాలతో ఏమీ సాధించలేమని, రాజీపడితే ఇద్దరూ గెలిచినట్లేనని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. ఈ నెల 28న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. రాజీపడదగిన కేసులలో క్రిమినల్ కంపౌండ బుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వాహణ కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని సూచించారు. చిన్న చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దని సూచించారు. పోలీస్ అధికారులు కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్లు, పోలీస్ సిబ్బంది రాజీపడ్డ దగిన కేసులను లను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పించాలని సూచించారు.