కాంగ్రెస్ ఎమ్మెల్యేల క‌ల‌యిక నిజ‌మే కానీ..

Congress: కాంగ్రెస్ ఎమ్మెల్యేల స‌మావేశం నిజ‌మే.. అయితే, మేం ర‌హ‌స్యంగా మాత్రం స‌మావేశం కాలేద‌ని ఆ పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు ఓ చోట కలిసి మాట్లాడుకోవటం రహస్య భేటీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. త్వరలోనే సీఎం రేవంత్, దీపాదాస్ మున్షీని కలిశాక అన్ని విషయాలు చెబుతానని అన్నారు.

అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యార‌ని ప్ర‌చారం సాగుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే హైదరాబాద్ శివారులోని ఓ ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశార‌ని, ఓ మంత్రి వ్యవహార శైలిపై వీరు గుర్రుగా ఉన్నారని పనుల కోసం కలిసి ఒత్తిడి చేద్దామని భేటీలో చర్చించినట్లు ప్ర‌చారం సాగుతోంది. శనివారం మంత్రుల స‌మావేశంలో సైతం ఈ వ్యవహారంపై చర్చ జరగ్గా గట్టిగానే వ్యవహరిద్దామని సీఎం, కొందరు మంత్రులు నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల రహస్య సమావేశంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్యేలు సమావేశమైన మాట నిజమేనని స్పష్టం చేసారు. కానీ తాము రహస్యంగా భేటీ కాలేదన్నారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడుకోవద్దా? అని ప్రశ్నించారు. తాను ఏ ఫైల్ కూడా రెవెన్యూ మంత్రి దగ్గర పెట్టలేదన్నారు. సీఎం రేవంత్, దీపాదాస్ మున్షీని కలిశాక పూర్తి వివరాలు చెబుతానని అన్నారు. అధిష్టానికి చెప్పాల్సింది చాలానే ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీని కలిశాక అన్ని విషయాలు మాట్లాడుతా అన్ని వివరాలు చెబుతా. నా క్యారెక్టర్‌ను తప్పుగా చూపిస్తే ఊరుకునేదే లేదు. ఎవరి చరిత్ర ఏంటో అందరికీ తెలిసిందే. అన్ని ఆధారాలతో పెద్దలతో మాట్లాడుతా’ అని అనిరుధ్ రెడ్డి మాట్లాడారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like