మోసపోయిన మోనాలీసా
ఆమెను ట్రాప్ చేశారంటున్న ప్రొడ్యూసర్

Kumbh mela Monalisa: కుంభమేళాలో పూసలమ్మే యువతి మీడియా పుణ్యమా అని వైరల్ అయిపోయింది. ఆమె మీడియాలో వైరల్ కావడంతో ఏకంగా ఆమెకు సినిమా ఆఫర్ కూడా వచ్చింది. సోషల్ మీడియా పుణ్యామా.. అని ఓవర్ నైట్ లో ఫెమస్ అయిపోయింది. దీంతో మోనాలిసా భోంస్లేను ఇంటర్వ్యూ చేసేందుకు యూట్యూబ్ ఛానెల్స్, టీవీల వాళ్లు పోటీలు పడ్డారు. కుంభమేళాకు వచ్చిన వారంతా మోనాలీసాను చూసేందుకు, ఆమెతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. దీంతో ఆమె ఫేమస్ అయిపోయింది. ఈ క్రమంలో ఆమెకు ఏకంగా సినిమాలో చాన్స్ ఇస్తానన్న దర్శకుడు సనోజ్ మిశ్రా.. తన సినిమా ది డైరీస్ ఆఫ్ మణిపూరీలో ఆమెను హీరోయిన్ గా తీసుకుంటున్నట్లు చెప్పారు.
అయితే ఈ క్రమంలో ఓ ప్రొడ్యూసర్ భారీ బాంబు పేల్చారు. మోనాలీసా డెంజర్ లో ఉందని, ఆమెతో సినిమా తీస్తానన్న సనోజ్ మిశ్రా దగ్గర అంత డబ్బులు లేవని ప్రొడ్యూసర్ జితేంద్ర నారాయణ్ బాంబు పేల్చారు. ఆయన వలలో మోనాలీసా చిక్కుకుందన్నారు. కేవలంలో దర్శకుడు లైమ్ లైట్ లో ఉండేందుకు మోనాలీసా ఫెమ్ ను ఉపయోగించుకున్నాడని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
మోనాలిసా వ్యవహారం కావడంతో దీనిపై సోషల్ మీడియాలో పెద్ద రచ్చ నడుస్తొంది. ఈ క్రమంలో దీనిపై మోనాలీసా క్లారిటీ ఇచ్చారు. సనోజ్ మిశ్రా తనను కూతురులా చూస్తారని… తనతో పాటు, తన చెల్లి, కుటుంబం ఉన్నారని చెప్పుకొచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యల్లో నిజం లేదని కూడా స్పష్టం చేసింది. మరోవైపు నేపాల్ లో జరిగే శివరాత్రి వేడుకలకు కుంభమేళ బ్యూటీ మోనాలీసాకు ఇప్పటికే ఆహ్వానం వచ్చిన విషయం తెలిసిందే.