పోష‌ణలోపం లేని స‌మాజాన్ని నిర్మిద్దాం

ICDS: పోష‌ణ లోపం లేని స‌మాజం నిర్మించ‌డ‌మే ల‌క్ష్యంగా అంగ‌న్‌వాడీల ద్వారా ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు మంచిర్యాల‌ ప్రాజెక్ట్ CDPO విజయలక్ష్మి అన్నారు. మంగ‌ళ‌వారం మంచిర్యాల ఏసీసీ సెక్టార్ సంజీవయ్య కాలనీలో పోషణ పక్షం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మ‌ట్లాడుతూ పౌష్టికాహారలోపం లేని గ్రామం, సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా సరైన పోషణ, పౌష్టికాహారం త‌దిత‌ర అంశాల‌పై అవగాహన కల్పిస్తున్నారని స్ప‌ష్టం చేశారు. చిన్నారులు, కిశోర బాలికలు, బాలింతలను పోషకాహారలోపం నుంచి విముక్తులను చేయడం ఆరోగ్యవంతులను చేయడానికి పోషణ్‌ పక్వాడా దోహదపడుతుంద‌న్నారు.

ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే పోషణ పక్షం కార్యక్రమాలను అనుసరించి అంగన్వాడీ కేంద్రాలను ఉపయోగించుకొని వారి సూచనల మేరకు పోషక ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. సూపర్ వైజ‌ర్ రమాదేవి మొదటి 1000 రోజుల సంరక్షణ, పౌష్టికాహార ప్రాముఖ్యత గురించి వివ‌రించారు. గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుబంధ పోషకాహారం లోప పోషణ ,పిల్లల లో పెరుగుదల పర్యవేక్షణ గురించి అవగాహన కల్పించారు. పిల్లలు, గర్భిణీలు, బాలింతలకి ఐసీడీఎస్ అందిస్తున్న సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్య‌క్ర‌మంలో ఏసీసీ సెక్టార్ల టీచ‌ర్లు, గ‌ర్భ‌వ‌తులు, బాలింత‌లు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like