ఇంటర్మీడియట్ ఫలితాలలో జిల్లా విద్యార్థుల ప్రతిభ
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాలలో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఇంటర్మీడియట పరీక్షా ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించి మందమర్రి తెలంగాణ ఆదర్శ పాఠశాల & జూనియర్ కళాశాల విద్యార్థులను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో ఎం.పి.సి.లో జీ. అనూష (987), టి. హర్షిత (982), బైపీసీలో పీ. వైశాలి (986), ఎం. హాసిని (973), సీఈసీలో ప్రతిమాదేవి (932), కె.శ్రీనిధి (927) మార్కులు సాధించారని తెలిపారు. భవిష్యత్తులో వార్షిక పరీక్షల ఫలితాలలో మంచిర్యాల జిల్లాను రాష్ట్రంలో ముందంజలో ఉంచాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి తెలంగాణ ఆదర్శ పాఠశాల & జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సారా తన్సీమ్, సంబంధిత అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.