తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద‌ర్‌రావు

Telangana BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పలువురు సీనియర్ నేతల పేర్లు ప్రముఖంగా వినిపించినా అధిష్ఠానం అనూహ్యంగా మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్‌రావును కొత్త అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. ఈ మేరకు ఆయన పేరు ఖరారు చేస్తూ, వెంటనే నామినేషన్ దాఖలు చేయాలని పార్టీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో రామచందర్‌రావు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు తన నామినేషన్‌ను సమర్పించనున్నారు.

రామచందర్ రావు బీజేపీలో సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడు. ఆయన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)లో చురుకైన పాత్ర పోషించారు. బీజేపీలో వివిధ కీలక పదవులను నిర్వహించారు. ఆయన రాష్ట్ర ప్రవక్తగా కూడా పనిచేశారు. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు మనవడిగా రాజకీయ వారసత్వం ఉంది. రామచందర్ రావుతో పాటు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, కె. లక్ష్మణ్, డీకే అరుణ, రఘునందన్ రావు వంటి పలువురు నాయకులు రేసులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, పార్టీ అధిష్టానం ఎన్నికలను నిర్వహించకుండా రామచందర్ రావును ఏకగ్రీవంగా ఎంచుకుంది.

రామచందర్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణలో బీజేపీని మరింత బలోపేతం చేయడం, రాష్ట్ర ప్రజల అభివృద్ధికి కృషి చేయడం తన లక్ష్యమని చెప్పారు. ఈ ఎన్నికతో బీజేపీ తెలంగాణలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించనుంది, ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఈ నిర్ణయం కీలకమైనదిగా భావిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవితోపాటు జాతీయ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నికకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి యెండల లక్ష్మీనారాయణ ఆదివారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. సోమవారం మధ్యాహ్నం 2 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు వచ్చినట్లయితే.. మంగళవారం మన్నెగూడలోని వేద కన్వెన్షన్‌ హాలులో ఎన్నికలు నిర్వహించనున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like