పేకాట రాయుళ్ల అరెస్టు

Arrest of poker players:పేకాట ఆడుతున్న ముగ్గురు వ్య‌క్తుల‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. సిర్పూర్ టి రైల్వే స్టేషన్ సమీపంలో పేకాట ఆడుతున్న ముగ్గురిని పట్టుకొని, వారి వద్ద నుండి రూ.26,470/- నగదు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ తెలిపారు. చింత‌కుంట‌కు చెందిన బింగినేని తిరుప‌తి, ఎ.మహేశ్వర్, బి. రాజుల‌ను అరెస్టు చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌లో చంకపురి మోహన్, బండా రవి, మొహమ్మద్ గుద్దు, ఎనుములే సునీల్, నవీన్, తమ్మ అనే వారు త‌ప్పించుకున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ప‌ట్టుబ‌డిన వారిపై సిర్పూర్ టి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసారని చెప్పారు. ఈ దాడుల్లో S.I రాజు, హెడ్ కానిస్టేబుళ్లు మహమూద్, కానిస్టేబుళ్లు విజయ్, మధు, రమేశ్ స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్న‌ట్లు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ వెల్ల‌డించారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like