ఆర్టీసీ బస్సులో దొంగతనం.. పోలీసుల తనిఖీలు
Theft in RTC bus.. Police checks:ఆర్టీసీ బస్సులో దొంగతనం జరగటంతో.. పోలీసులు వెంటనే తనిఖీ చేపట్టారు. కొమురం భీమ్ జిల్లా దహెగాం నుంచి మంచిర్యాల జిల్లా కేంద్రానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో రూ..40,000 రూపాయలు దొంగతనం జరిగింది. దీంతో బాధితుడు లబోదిబోమనడటంతో వెంటనే స్పందించిన బస్ డ్రైవర్ బెల్లంపల్లి తాళ్ల గురిజల పోలీస్ స్టేషన్ ముందు బస్సు నిలిపి వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు బస్ లో ప్రయాణికులను తనిఖీ చేపట్టారు. అయినా ఫలితం లేకుండా పోయింది.