10న తెలంగాణ బంద్

ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేక జీవోతో పాటు,అక్రమ అరెస్టులు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది భారతీయ జనతా పార్టీ. ఈ నెల 10న తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది ఆ పార్టీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకు వచ్చిన 317 జీవోను పునఃసమీక్షించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఆ జీవో విషయంలో ఆందోళన చేస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని బీజేపీ నేతల ఆరోపిస్తున్నారు. 317 జీవోను పునఃసమీక్షించాలని దీక్ష చేపట్టిన బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు వివిధ ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న బీజేపీ శ్రేణులపై కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలపాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈనెల 10న తెలంగాణ బంద్కు భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. అన్ని వర్గాల ప్రజలు బంద్ పాటించి మద్దతు ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ ప్రజలను కోరింది.