ఒకరి మృతదేహం వెలికితీత.. కొనసాగుతున్న గాలింపు
మంచిర్యాల: కోటపల్లి మండలం ఆలుగామ వద్ద ప్రాణహితలో ముగ్గురు విద్యార్థులు గల్లంతైన ఘటనలో మంగళవారం ఒక విద్యార్థి మృతదేహాన్ని గుర్తించారు. తొమ్మిదో తరగతి చదువుతున్న విజయేంద్రసాయి మృతదేహాన్ని వెలికితీసినట్లు గాలింపు బృంందాలు వెల్లడించాయి. ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. సోమవారం సరదాగా ఈతకు వెళ్లిన ఆరుగురు విద్యార్థుల్లో ముగ్గురు గల్లంతైన విషయం తెలిసిందే. సంక్రాంతి సెలవుల నిమిత్తం ఇంటికి వచ్చిన విద్యార్థులు.సరదాగా ఊరు పక్కనే ఉన్న ప్రాణహిత నదిలో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఉదయం నుంచి మందమర్రి నుంచి వచ్చిన ఎనిమిది బృందంతో కూడిన సింగరేణి రెస్య్కూ టీం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. జైపూర్ ఏసీపీ నరేందర్, చెన్నూరు రూరల్ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో ఈ గాలింపు కొనసాగుతోంది.