బాసరలో భక్తుల రద్దీ

నిర్మల్‌: వసంత పంచమిని పురస్కరించుకొని ప్రముఖ దేవాలయమైన బాసర జ్ఞాన సరస్వతి ఆలయం భక్తులతో రద్దీగా మారింది. అర్ధరాత్రి నుంచి సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులుదీరారు. తెల్లవారుజామున 2 గంటలకు అభిషేకంతో ఈ ఉత్సవానికి అంకురార్పణ చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి వచ్చి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం పూజలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like