గ‌నిలో గుండెపోటు.. కార్మికుడి మృతి

Singareni worker died of heart attack in mine: సింగ‌రేణి గ‌నిలో విధులు నిర్వ‌ర్తిస్తున్న కార్మికుడికి గుండెపోటు రావ‌డంతో మృతి చెందాడు. కాసిపేట 1 గ‌నిలో విధులు నిర్వ‌ర్తిస్తున్న కార్మికుడు మార్త ర‌మేష్ ఉద‌యం షిఫ్టులో విధులు నిర్వ‌హిస్తున్నాడు. చాతీలో నొప్పి రావ‌డంతో తోటి కార్మికుల సాయంతో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మొద‌ట కేకే 1 డిస్పెన్స‌రీ తీసుకువెళ్ల‌గా, అక్క‌డి నుంచి బీజోన్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స చేస్తున్న స‌మ‌యంలో మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు తెలిపారు. ర‌మేష్ జ‌న‌ర‌ల్ మ‌జ్దూర్ ఇంజ‌నీరింగ్ విభాగంలో జ‌న‌ర‌ల్ మజ్దూర్‌గా విధులు నిర్వ‌హిస్తున్నాడు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like